Wednesday, June 24, 2026

Creating liberating content

তারাতলা বিপর্যয়ের পর কলকাতায়...

তারাতলার নির্মীয়মাণ গুদামের ছাদ ধসে প্রাণহানির ঘটনার জেরে বড়সড় প্রশাসনিক সিদ্ধান্ত নিল রাজ্য...

ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల...

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే...

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు...

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద...
Homeతెలుగుతాజావార్తలుమంగళగిరిలో సందడి చేసిన...

మంగళగిరిలో సందడి చేసిన రామ్ చరణ్.. ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఏపీఎల్ ట్రోఫీని, టోర్నీలో పాల్గొంటున్న జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. ఆయన రాకతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రామ్ చరణ్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇలాంటి టోర్నమెంట్లు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, పోరాట స్ఫూర్తిని పెంచుతాయని తెలిపారు. ఏపీఎల్‌లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఏపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు జూన్ 27 వరకు కొనసాగనున్నాయి. అనంతరం ప్లేఆఫ్స్ నిర్వహించి, జూన్ 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భీమవరం బుల్స్ జట్టు 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల భూ కబ్జా యత్నానికి హైడ్రా చెక్..

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న సర్వే నంబర్...

యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో రామ్ దేవ్ బాబా చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. గత 30 ఏళ్లుగా రామ్...

సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి:శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, కానీ తెలంగాణలో దీనిని...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.