Wednesday, June 24, 2026

Creating liberating content

তারাতলা বিপর্যয়ের পর কলকাতায়...

তারাতলার নির্মীয়মাণ গুদামের ছাদ ধসে প্রাণহানির ঘটনার জেরে বড়সড় প্রশাসনিক সিদ্ধান্ত নিল রাজ্য...

మంగళగిరిలో సందడి చేసిన రామ్...

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్...

విజయ్‌కు త్రిష స్పెషల్ బర్త్‌డే...

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద రక్షణకు...

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద...
Homeతెలుగుతాజావార్తలుఐటీ కారిడార్‌లో రూ.1000...

ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల భూ కబ్జా యత్నానికి హైడ్రా చెక్..

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న సర్వే నంబర్ 42లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై కొందరు అక్రమంగా కన్నేశారు. స్థలం చుట్టూ రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక షెడ్లు, గది నిర్మించి ఆక్రమించేందుకు ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ శాఖ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా బృందం అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించింది. అనంతరం భూమి చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ భూమి అని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేసింది.ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, ఎంత విలువైన ప్రాంతమైనా అక్రమ ఆక్రమణలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మర్రిపల్లి గ్రామంలో చెరువు భూమి ఆక్రమణ ప్రయత్నాన్ని కూడా హైడ్రా అడ్డుకుంది. పట్టా భూమిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ యూనిట్ నుంచి వ్యర్థాలను చెరువులోకి వేసి సుమారు ఐదెకరాల చెరువు భూమిని ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు చెరువు శిఖం పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. చెరువులో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు.హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాల నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

మంగళగిరిలో సందడి చేసిన రామ్ చరణ్.. ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీల ఆవిష్కరణ

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఏపీఎల్ ట్రోఫీని, టోర్నీలో పాల్గొంటున్న...

యోగాతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు సాధ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి ఉండవల్లి గుహల వద్ద యోగా గురువు రామ్ దేవ్ బాబా నిర్వహించిన యోగాసాధన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. యోగాంధ్ర లోగోతో కూడిన షర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. యోగాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో రామ్ దేవ్ బాబా చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. గత 30 ఏళ్లుగా రామ్...

సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి:శాసనమండలిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్

భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, కానీ తెలంగాణలో దీనిని...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.